ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్ష్యేత్రములో భక్తుల గందరగోళ పరిస్థితి ఇది .
ఇటీవల కాలం లో లెక్కకు మించిన భక్తుల తాకిడితో ద్వారకాతిరుమల భక్తుల సంఖ్య పెరిగింది. దీనికి అనుగుణంగా
దేవాస్థాన యాజమాన్యం పెద్ద ఎత్తున కేశఖండన శాల , అన్నదాన శాల, భక్తుల క్యూ లైనులు ఏర్పాట్లు చక చక చేసింది.
ఈ ఏర్పాట్లు నేపథ్యం లో సగటు సమాన్య భక్తుడు ఆర్టీసీ బస్సు దిగిన లగాయతు తన నీలాల మొక్కులు తీర్చుకుని ,
దైవ దర్శనం చేసుకుని ఆ భారీ క్యూ లైనులో ప్రసాదాలు కొనుక్కుని కాలే కడుపుతో అన్నదానం లో భోజనం చేసి తిరిగి
ఆర్టీసీ బస్టాండ్ చేరేసరికి పరిస్థితి ఒక్కసారిగి పదికేజిలు బరువు తగ్గినట్టుగా రోగి పరిస్థితి ఏర్పడింది . ఇన్ని ప్రయాసల
మధ్య తనను ఆదుకునే దేవుడు ఎక్కడ అని భక్తుడు రోధిస్తున్నాడు . గతం లో 45 మెట్లు కొండెక్కి పక్కనే ఉన్న పడమట
గోపురంలో కేశఖండన శాల మొక్కు తీర్చుకుని డైరెక్టుగా క్యూ లైనులోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు . మెట్లు
దిగగానే అన్నదానం లో భోజనం చేసి పది అడుగుల దూరం లో ఆర్టీసీ బస్సు ఎక్కేవారు . ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్
నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీవారి కేశఖండన శాల దూరంగా విసిరి వేయ బడింది . తంటాలు పది
కేశఖండన శాలలో మొక్కులు తీర్చుకున్న భక్తుడు శ్రీవారి దర్శనానికి రావడానికి సుమారుగా అరకిలోమీటరున్న ఎత్తైన
మెట్ట, ఎర్రటి ఎండను, బోరున పడే వర్షాలను లెక్క చేయక నడుచుకుంటూ వెళితేనే శ్రీవారి దర్శనం. ఈ మధ్యలో తమ
లగేజీలు ఎక్కడ పెట్టాలి? తల నీలాల మొక్కులు తీర్చుకునే భక్తుల కుటుంబాలు ఎక్కడ ఉండాలి? ఇవన్నీ ప్రశ్నలే .
నడవలేక నడవలేక ఆయాసపడే వృద్ధులు, రోగులు బాధలైతే మరి.. వర్ణణాతీతం అని చెప్పాలి. ఎక్కడో తిరుమల
తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా చేసుకుని భవనాలు సిమెంటు కట్టడాలు ఐతే కట్టారు గాని భక్తులకు అందుబాటులో
ఇవేమి లేకపోవటం బాధాకరమైన విషయం . దర్శనం అనంతరం దేవస్థానం అన్నదాన సత్రానికి వెళ్లాలంటే ఆ
మిట్టమధ్యాన సమయంలో కిలోమీటరు దూరం నడవాలి . దేవస్థానం ఉచిత బస్సు సర్వీసులు పేరుకు మాత్రమే తప్ప
అందరి భక్తుల అవసరాలు తీర్చేవిధంగా బస్సులు లేకపోవటం, శ్రీవారి కేశఖండన శాల నుండి దర్శనం కౌంటర్లకు
మధ్య నడక ఒకటే ఇప్పటికి శరణ్యముగా ఉండటం, భక్తులకు శ్రీవారి దర్శనం భారంగానే కొనసాగుతుంది. ఈ
అలసటలో శ్రీవారి దర్శన ఆనందాన్ని భక్తుడు పూర్తిగా అనుభవించలేకపోవడం శోచనీయం కాదా .
No comments:
Post a Comment